పేపర్ లీకేజీపై తలకొండపల్లిలో కాంగ్రెస్ యువ నాయకుల నిరసన
పేపర్ లీకేజీ ఘటనలపై తలకొండపల్లి మండల కాంగ్రెస్ యువ నాయకులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. దేశ యువత భవిష్యత్తుతో ముడిపడిన పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమగ్రంగా చర్చించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీకి కారణమైన వారిని గుర్తించి, చట్ట ప్రకారం కఠిన శిక్షలు విధించాలని కాంగ్రెస్ యువ నాయకులు కోరారు. అలాగే, రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.
– కల్వకుర్తి వార్తలు
రిపోర్టర్: మొగిలి శెట్టి యాదగిరి, తలకొండపల్లి















