ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును ఖండిస్తూ ధర్నా
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కల్వకుర్తి మండల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మామిళ్ళపల్లి వంశీ పాల్గొన్నారు.
కల్వకుర్తి వార్తలు
. మొగిలిశెట్టి యాదగిరి రిపోర్ట్















